Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బాహుబలి' పనైపోయినా ఇంకా వేయాలని ఒత్తిడి ఎందుకు ఫ్రెండ్స్... రాజమౌళి ప్రశ్న

'బాహుబలి' పనైపోయినా ఇంకా వేయాలని ఒత్తిడి ఎందుకు ఫ్రెండ్స్... రాజమౌళి ప్రశ్న
, గురువారం, 27 ఆగస్టు 2015 (16:14 IST)
బాహుబలి దర్శకుడు రాజమౌళి చాలా రోజుల తర్వాత మళ్లీ ట్విట్టర్లో సందేశాలు రాస్తున్నారు. తాజాగా ఆయన ఇలా రాశారు. ''50 రోజులు, 100 రోజులు, 175 రోజులు అనే రికార్డుల కాలం గత చరిత్ర. ఇప్పుడు ఏ చిత్రమైనా వేల సంఖ్యలో స్క్రీన్లపై విడుదలవుతుంది. అలాగే ఎంత గట్టిగా ఆడినా 3 లేదంటే 4 వారాలు. అంతే. 
 
ఐతే బాహుబలి విషయానికి వచ్చేసరికి కొన్ని పెద్దపెద్ద స్క్రీన్లలో మాత్రమే ఇంకా షేర్స్ వస్తున్నాయి. చాలావరకూ బాహుబలి రన్ ముగిసింది. అయినప్పటికీ ఇంకా ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని కొంతమంది అభిమానులు ఒత్తిడి చేయడం విచారకరం. 
 
కొన్నిసార్లు అభిమానంకొద్దీ కొందరు అభిమానులు వారి జేబుల్లోంచి డబ్బులు తీసి మరీ చిత్రాన్ని ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లను కోరుతున్నారు. ఇలాంటి ఫాల్స్ రికార్డుల వల్ల మనం ఏం సాధించుకుంటాం ఫ్రెండ్స్...?'' అంటూ రాజమౌళి ట్విట్టర్లో ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu