ఆ చిత్రం నాగ చైతన్య - సమంతల 'ఏ మాయ చేశావే'కు సీక్వెలట!
నాగచైతన్య, సమంత నటించిన చిత్రం 'ఏ మాయ చేశావే'. ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇద్దరికీ మంచి పేరురావడంతోపాటు నిజజీవితంలో ఒక్కటయ్యే అవకాశాన్ని ఆ చిత్రం కల్పించిదనడంలో ఆశ్చర్యంలేదు. మరలా ఆ చిత్రం తర్వాత నా
నాగచైతన్య, సమంత నటించిన చిత్రం 'ఏ మాయ చేశావే'. ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇద్దరికీ మంచి పేరురావడంతోపాటు నిజజీవితంలో ఒక్కటయ్యే అవకాశాన్ని ఆ చిత్రం కల్పించిదనడంలో ఆశ్చర్యంలేదు. మరలా ఆ చిత్రం తర్వాత నాగచైతన్య.. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 11న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి సోమవారం దర్శకుడు హైదరాబాద్లో మాట్లాడుతూ... నేనే యేడాదిన్నరగా సినిమా చేశాను.
ఇంత ఆలస్యమైందని అందరూ అనుకున్నారు. ఓ దశలో చాలా ఇబ్బందులు పడ్డాం. దాన్ని దిల్రాజు, బెల్లంకొండ సురేష్ ఎంతో సహకరించారు. వారికి ధన్యవాదాలని తెలిపారు. కాగా, చిత్రం గురించి చెబుతూ... నాగచైతన్య బాగా చేశాడు. మంజిమ మోహన్ బాగా నటించింది. నాగచైతన్య నటించిన 'ప్రేమమ్' తర్వాత విడుదలకావడం చాలా ప్లస్ అవుతుంది.
'ఏ మాయ చేశావే' అనే కాన్సెప్ట్ ఓ బాయ్ స్టోరీ. తను ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి.. దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడనేది కథ. 'సాహసం శ్వాసగా సాగిపో' కథ.. ఆ బాయ్ మ్యాన్గా ఎలా మారాడనేది చిత్రమని చెప్పారు. అంటే.. ఏ మాయ చేశావేకు సీక్వెల్లాంటిదన్నమాట. ఈ విషయాన్ని దర్శకుడు చెప్పకనే చెప్పాడు.