Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'రోజులు మారాయి' పాటలకు స్పందన.. లోకల్ సింగర్స్ అదుర్స్ అంటున్న మారుతి - దిల్ రాజు

'రోజులు మారాయి' పాటలకు స్పందన.. లోకల్ సింగర్స్ అదుర్స్ అంటున్న మారుతి - దిల్ రాజు
, మంగళవారం, 21 జూన్ 2016 (16:37 IST)
మారుతి, దిల్‌ రాజు కలిసి నిర్మిస్తున్న చిత్రం 'రోజులు మారాయి'. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. జూలై 1న సినిమా విడుదలవుతుంది. ఇటీవల జె.బి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. వాటికి మంచి స్పందన వస్తోందని సంగీత దర్శకుడు తెలియజేస్తున్నాడు. 
 
సంగీత దర్శకుడు జె.బి మాట్లాడుతూ పాటలు శ్రోతలను అలరిసున్నాయి. దిల్‌రాజు ఈ సినిమాలో భాగమవుతున్నారని తెలియగానే కొద్దిగా భయపడ్డాను. అయితే ఆయన నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. ఈ చిత్రంలో కాసర్ల శ్యామ్‌ నాలుగు పాటలు, కిట్టు ఒక పాటను రాశారు. లోకల్‌ సింగర్లు చక్కగా పాడారని అన్నారు. 
 
కాసర్లశ్యామ్‌ మాట్లాడుతూ 'ఈరోజుల్లో' సినిమా నుండి నాకు జెబిగారితో అనుబంధం ఉంది. ఆయన బాణీలు కూర్చే సినిమాలకు నన్ను ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడు ఈ సినిమాలో 4 పాటలు రాసే అవకాశాన్ని కలిగించారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జెబి మంచి సంగీతంతో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అందించారు. ఆడియో హిట్‌ అయినట్లే సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకముందన్నారు. గాయనీగాయకులు రమ్యబెహరా, అనుదీప్‌, రోహిత్‌, లిప్సికా, నయన తదితరులు సంగీతప్రియులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మ‌నమంతా' చిత్రం కోసం తెలుగులో డ‌బ్బింగ్ చెబుతున్న మోహ‌న్‌లాల్‌