నటి రెజీనా స్పీడ్ పెంచింది. గీతా ఆర్డ్స్ బేనర్తో పాటు.. మరో బిగ్ ఆఫర్ అందుకుంది. యాక్షన్ హీరో గోపిచంద్ పక్కన నటించే ఛాన్సును రెజీనా సొంతం చేసుకుంది. ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత నెలలో ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్గా రెజీనాను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
మరోవైపు అల్లు అర్జున్, శిరీష్తో పాటు మారుతీ దర్శకత్వంలోని సినిమాల్లో రెజీనా నటిస్తోంది. ప్రస్తుతం అదే కాంపౌండ్ హీరో సాయిధరమ్తేజతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో నటిస్తోంది. అంతకుముందు ఆమె చేసిన 'శంకర' చిత్రం విడుదలకు సిద్ధం కానుంది. ఈ చిత్రాలు తర్వాత తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. కానీ అది కొన్ని కారణాలవల్ల డ్రాప్ అవ్వాల్సివచ్చిందిని రెజీనా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతానికి అమ్మడు చేతులో రెండు సినిమాలున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.