Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రవితేజ-దిల్ రాజు 'ఎవడో ఒకడు' చిత్రానికి బ్రేక్ పడింది ఎందుకని...?

రవితేజ-దిల్ రాజు 'ఎవడో ఒకడు' చిత్రానికి బ్రేక్ పడింది ఎందుకని...?
, శుక్రవారం, 22 జనవరి 2016 (17:06 IST)
రవితేజ కిక్‌ 2 తర్వాత 'ఎవడో ఒకడు' అనే చిత్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు దిల్‌ రాజు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. దిల్‌ రాజు కూడా.. సాంప్రదాయ దుస్తులు ధరించి.. హోమం కూడా చేశాడు. అయితే ఆ చిత్రం అనుకున్న సమయానికి సెట్‌పైకి వెళ్ళలేకపోయింది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ముఖ్యంగా రవితేజ రెమ్యునరేషన్‌ విషయంలో ఏకాభిప్రాయం రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. 
 
దిల్‌రాజు.. రవితేజ అడిగినంత ఇవ్వడం లేదని విన్పిస్తోంది. తనకు పెద్దగా హిట్లు లేవని.. ఆయన తగ్గించినట్లు సమాచారం. ఇందుకు రవితేజ పట్టుపట్టడం.. ఓ కారణంగా తెలుస్తోంది. కొత్త దర్శకుడు వేణు శ్రీరాం ఈ చిత్రానికి దర్శకుడు. రవితేజకు ఎప్పుడో ఆయన కథ చెప్పాడు. 
 
ఇప్పుడు ఈ చిత్రం గ్యాప్‌ రావడంతో.. దర్శకుడిగా వేణుకు బ్రేక్‌ పడుతుందేమోనని సన్నిహితులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇందులో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. వీరికి ఇతర చిత్రాల ప్రభావం కూడా పడనుంది. డేట్స్‌ అనవసరంగా వేస్టు అవుతాయని భయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu