టాలీవుడ్లో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల రాశి రాశీఖన్నా. ఈ ముద్దు గుమ్మకి తెలుగులో అవకాశాలు బాగానే ఉన్నా, అమ్మడు అందాల ఆరబోతకు తప్ప, నటనకు పనికిరాదనే బ్యాడ్ టాక్ ఉంది. అయితే రాశీఖన్నాకు ఇప్పుడొచ్చిన ఛాన్స్ ఆ బ్యాడ్ టాక్ నుంచి బయటపడేస్తుందట. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'శివం'.
ఇందులో రామ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో రాశీఖన్నా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందట. ఈ పాత్ర నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రట. చాలా కాలంగా నటనకు అవకాశం పాత్ర కోసం ఎదురుచూస్తున్న రాశీఖన్నాకు ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర లక్కీగా చిక్కిందట. ఈ పాత్రలో ప్రేక్షకులను మెప్పించి, గ్లామర్తో మాత్రమే ఆకట్టుకోగలదనే విమర్శ నుంచి బయటపడటానికి ఆమె ప్రయత్నిస్తోంది. కాగా రెండు పాటలు మినహా షూటింగ్ పార్ట్ను పూర్తిచేసుకుని 'శివం' సెప్టెంబర్లో విడుదలవుతుంది.