విశాల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్... మళ్లీ కోలీవుడ్లో ఛాన్స్
తెలుగులో అగ్ర తారగా ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ప్రీత్సింగ్ చాలాకాలం తర్వాత మళ్లీ కోలీవుడ్కు వస్తోంది. ఆర్య తమ్ముడు సత్య హీరోగా నటించిన "పుత్తగం'' ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయమైంది.
తెలుగులో అగ్ర తారగా ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ప్రీత్సింగ్ చాలాకాలం తర్వాత మళ్లీ కోలీవుడ్కు వస్తోంది. ఆర్య తమ్ముడు సత్య హీరోగా నటించిన "పుత్తగం'' ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయమైంది. తర్వాత తెలుగులో అగ్రహీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ హీరో విశాల్తో జోడీ కట్టి మళ్లీ కోలీవుడ్లో అడుగుపెడుతోంది.
విశాల్ హీరోగా ప్రస్తుతం ''కత్తిసండై'' విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే మిష్కిన్ దర్శకత్వంలో ''తుప్పరివాళన్''లోనూ విశాల్ నటించనున్నారు. ఇందులో కథానాయికగా రకుల్ప్రీత్సింగ్ను ఎంపిక చేసుకున్నారు. మిస్కిన్ దర్శకత్వంలో రాబోతున్నఈ చిత్రానికి విశాల్ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.విశేషం ఏమిటంటే, రకుల్ తెలుగులోకి రాకముందు తమిళంలో రెండు చిత్రాలలో నటించింది. అయితే, అవి సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ బాట పట్టింది.