Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాధికా ఆప్టే అంటే ఏమనుకున్నారు.. గోవా ఫిలిమ్ ఫెస్టివల్‌లో జ్యూరీగా ఎంపిక!

రాధికా ఆప్టే అంటే ఏమనుకున్నారు.. గోవా ఫిలిమ్ ఫెస్టివల్‌లో జ్యూరీగా ఎంపిక!
, శుక్రవారం, 20 నవంబరు 2015 (12:38 IST)
రాధికా ఆప్టే అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో చాలా ప్రతిష్టాత్మకంగా భావించే.. గోవాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో రాధికా ఆప్టే జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైంది. సాధారణం ఈ ఫిలిమ్ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యులుగా మహా మహులే ఉంటారు. వాళ్ల స్టాండర్స్ ఇంటర్నేషనల్ రేంజిలో ఉంటాయి. అలాంటి జ్యూరీలో రాధికకు చోటు దక్కడం ద్వారా ఆమె లెవలేంటో అర్థం చేసుకోవాలని సినీ పండితులు అంటున్నారు. 
 
గత ఏడాది కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ ఫరా ఖాన్‌కు జ్యూరీలో స్థానం లభించగా... ఆమె స్థానంలో ప్రస్తుతం రాధికా ఆప్టేను తీసుకున్నారు. ఇది తనకు అరుదైన గౌరవమని.. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని రాధికా ఆప్టే వెల్లడించింది. ఈ ఫిలిం ఫెస్టివల్ 20న మొదలై పది రోజుల పాటు కొనసాగుతుంది.
 
కాగా రాధికా ఆప్టే భారత్‌లో అత్యధిక మంది గూగుల్ సెర్చ్‌లో వెతికిన హీరోయిన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు బద్లాపూర్ - హంటర్ లాంటి సినిమాలతో.. ‘అహల్య’ లాంటి ఇంటర్నేషనల్ రేంజి షార్ట్ ఫిలింతో తనేంటో రాధిక చాటి చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu