Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రిన్స్ మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ జనగణమన... ఫస్ట్ లుక్ జాతీయ పతాకంలో....

సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ 'పోకిరి'. ఈ చిత్రం విడుదలై ఈరోజుకి 10 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మ

ప్రిన్స్ మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ జనగణమన... ఫస్ట్ లుక్ జాతీయ పతాకంలో....
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (22:06 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ 'పోకిరి'. ఈ చిత్రం విడుదలై ఈరోజుకి 10 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మార్క్‌ దాటిన తొలి సినిమా 'పోకిరి'. సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం పదేళ్ళు పూర్తిచేసుకుంది. 
 
ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'బిజినెస్‌మేన్‌' చిత్రం కూడా సూపర్‌హిట్‌ అయింది. 'పోకిరి' పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త సినిమా 'జనగణమన' టైటిల్‌ని పూరి జగన్నాథ్‌ ఎనౌన్స్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
 
ఇప్పుడు మరోసారి పూరీ జగన్నాథ్ మహేష్ బాబు హీరోగా జనగణమన అనే చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేశారు. ఈ పోస్టరులో మహేష్ బాబు లుక్ అదరగొడుతోంది. జాతీయ పతాకంలో సీరియస్ లుక్‌తో మహేష్ బాబు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెయిట్‌ తగ్గే పనిలోనే ఉన్నా: 'రాజా చెయ్యి వేస్తే' నారా రోహిత్‌ ఇంటర్వ్యూ