Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దర్శకుడు రాజమౌళికి చెప్పి మరీ ప్రధాని వద్దకెళ్లిన 'బాహుబలి' ప్రభాస్‌... ఏంటి సంగతి?

దర్శకుడు రాజమౌళికి చెప్పి మరీ ప్రధాని వద్దకెళ్లిన 'బాహుబలి' ప్రభాస్‌... ఏంటి సంగతి?
, సోమవారం, 27 జులై 2015 (16:03 IST)
ప్రభాస్‌ ఢిల్లీలోని ప్రధాని ఇంటిలో ఆదివారం నాడు సమావేశం కావడం పట్ల ఆయన ఫ్యాన్స్‌ చాలా ఆనందంతో వున్నారు. కృష్ణంరాజు కుటుంబంతో కలిసి వెళ్ళిన ఆయనకు మోదీ మంచి స్వాగతం పలికారు. బాహుబలి సినిమా గురించి చర్చించడం.. వీలు చూసుకుని చూస్తానని అనడం పెద్దగా ప్రచారం జరిగింది. మోదీ.. ట్వీట్‌ చేస్తూ ఫొటోలు కూడా పెట్టడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మరోవైపు సోమవారం ఉదయానికల్లా జూబ్లీహిల్స్‌లోని కొన్ని కూడళ్ళల్లో మోదీ, ప్రభాస్‌ విషెస్‌ చేస్తున్న పోస్టర్లు వెలిసిపోయాయి.
 
రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇతర నాయకులతో ఈ సినిమా చూసి మెచ్చుకోవడం ప్రభాస్‌ గౌరవంగా భావించాడు. బాలీవుడ్‌లో విడుదలై చర్చనీయాంశమైన బాహుబలి సినిమా ద్వారా ఒక్కసారిగా ప్రభాస్‌ జాతీయ నటుడు అయిపోయాడు. ప్రభాస్‌ మంచితనం ఏమిటంటే... దర్శకుడు రాజమౌళికి తెలియజేసి మరీ వెళ్ళడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి విదేశాల్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. త్వరలో ఆయన తిరిగి వచ్చాక.. బాహుబలి-2 చిత్రం పనిలో నిమగ్నమవుతారు.

Share this Story:

Follow Webdunia telugu