Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ఓం నమో వేంకటేశా''లో శ్రీవారిగా శౌరబ్ రాజ్ జైన్.. శ్రీదేవి, భూదేవిలుగా విమల, పావని!!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ''ఓం నమో వేంకటేశా'' సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదా

''ఓం నమో వేంకటేశా''లో శ్రీవారిగా శౌరబ్ రాజ్ జైన్.. శ్రీదేవి, భూదేవిలుగా విమల, పావని!!
, బుధవారం, 22 జూన్ 2016 (17:36 IST)
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ''ఓం నమో వేంకటేశా'' సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయి వంటి భక్తిరస చిత్రాలు మంచి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో.. వేంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరామ్ బాబా కథతో తెరకెక్కే ''ఓం నమో వేంకటేశా'' సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. 
 
ఇక ఈ సినిమాలో శ్రీవారిగా బాలీవుడ్ యాక్టర్, మహాభారతంలో శ్రీకృష్ణుడిగా నటించిన బాలీవుడ్ యాక్టర్ శౌరబ్ రాజ్ జైన్ నటిస్తుండగా, శ్రీదేవి పాత్రకు విమలారామన్, భూదేవి పాత్రకు పావని గంగిరెడ్డిని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని కీలకమైన సన్యాసి పాత్రలో బాహుబలి దేవసేన అనుష్క నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే అవకాశం రావడంపై మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా ద్వారా పాపులరైన పావని గంగిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది మహేష్ బాబు బ్రహ్మోత్సవం, సుమంత్ అశ్విన్ రైట్ రైట్ సినిమాల్లోనూ పావని గంగిరెడ్డి నటించింది. ఇకపోతే.. ఓం నమో వేంకటేశాయ సినిమాకు యమ్.యమ్. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. అలాగే నాగార్జున గడ్డం లుక్‌లో ఈ చిత్రంలో కనిపిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌతమీపుత్ర శాతకర్ణిలో మోహన్ బాబు: 101 సినిమా చర్చల్లో బాలయ్య, కృష్ణవంశీకి ఛాన్స్!