Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిట్ పిటిషన్‌లో ధనుష్ సంతకం నకిలీది: మరో కేసు పెట్టిన కదిరేసన్ దంపతులు

కొలవెరి హిట్ మేకర్.. రజనీకాంత్ అల్లుడు, ధనుష్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధనుష్ తన కుమారుడు అంటూ వృద్ధ దంపతులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ వృద్ధ దంపతులతో తనకు ఎలాంటి సంబంధం లేద

రిట్ పిటిషన్‌లో ధనుష్ సంతకం నకిలీది: మరో కేసు పెట్టిన కదిరేసన్ దంపతులు
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:42 IST)
కొలవెరి హిట్ మేకర్.. రజనీకాంత్ అల్లుడు, ధనుష్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధనుష్ తన కుమారుడు అంటూ వృద్ధ దంపతులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ వృద్ధ దంపతులతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నాడు. మేలూరు తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన ఆర్. కథిరేసన్(60), కె. మీనాక్షి(55) ధనుష్ తమ కొడుకేనంటూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.
 
ధనుష్ తమకు నవంబర్ 7, 1985న సంవత్సరం జన్మించాడని ఆ వృద్ధ దంపతులు కోర్టులో వాదిస్తున్నారు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ధనుష్ మీద తాజాగా కదిరేసన్ దంపతులు మరో కేసు పెట్టారు. ధనుష్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో అతని సంతకం నకిలీదని పేర్కొంటూ కేసు వేశారు. అంతే కాకుండా అతని సంతకం నకలును తమకు అందజేయాల్సిందిగా వారు కోర్టును కోరుతున్నారు. 
 
ఇప్పటికే కదిరేసన్ దంపతులు కోరినట్లు ధనుష్ పుట్టు మచ్చలను వైద్యులు పరిశీలించి నివేదిక సమర్పించారు. లేజర్ టెక్నాలజీ ద్వారా ధనుష్ తన ఒంటిపై ఉన్న పుట్టు మచ్చలను చెరిపేసుకున్నాడని తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికతో ధనుష్ ఈ కేసులో మరింత ఇబ్బందుల్లో పడ్డట్లయింది. ఈ కేసు ఏప్రిల్‌ 11న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ధనుష్ రిట్ పిటిషన్‌లో చేసిన సంతకం నకిలీదని వృద్ధ దంపతులు కేసు పెట్టడం సంచలనం సృష్టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్ మాజీ ప్రేయసి శ్రియా భూపాల్ మరో అబ్బాయితో పెళ్లి...? రాజుగారి గదిలో నాగ్