Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈనెల 25న "ఓం నమో వేంకటేశాయ" చిత్ర నిర్మాణం ప్రారంభం : సినీనటుడు నాగార్జున

ఈనెల 25న
, గురువారం, 23 జూన్ 2016 (13:05 IST)
ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌లో "ఓం నమో వేంకటేశాయ" చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుందని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ చిత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న మరో గొప్ప ఆధ్యాత్మిక చిత్రం ఇదేనన్నారు. అన్నమయ్య తర్వాత శ్రీవారి పేరు మీద మరో సినిమా తీస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున అన్నారు. 
 
తిరుమల శ్రీవారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి హీరో నాగార్జున దర్శించుకున్నారు. అలాగే 'ఓం నమోవేంకటేశాయ' చిత్రంలో నటించే చిత్ర బృందంలోని సభ్యులు కూడా స్వామివారికి వీఐపీ విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు. 
 
ఆలయం వెలుపల రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నానని, అయితే సమయం దొరక్కపోవడం వల్ల, నాగార్జునకు బిజీ షెడ్యూల్‌ ఉండటం వల్ల చిత్రీకరించపోయామని చెప్పారు. ఈనెల 25వ తేదీన ఘూటింగ్‌ ప్రారంభించి కంటిన్యూగా సినిమాను తీస్తామన్నారు. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా మహాభారత్‌లో శ్రీకృష్ణుడి పాత్రధారి స్వభావ్‌ జైన్‌ నటించనున్నట్లు రాఘవేంద్ర రావు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలియా భట్‌కు అమ్మగా మాధురీ దీక్షిత్: కరణ్ జోహార్‌కు గ్రీన్ సిగ్నల్!