Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నేను శైలజ' డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నితిన్

'నేను శైలజ' డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నితిన్
, శనివారం, 6 ఫిబ్రవరి 2016 (19:52 IST)
'ఇష్క్','గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్ ఎటాక్' చిత్రాలతో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న నటుడు నితిన్. లేటెస్ట్‌గా రామ్ హీరోగా 'నేను శైలజ' వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను రూపొందించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కిషోర్ తిరుమల. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
నితిన్‌తో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పైన నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అ ఆ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం కిషోర్ తిరుమల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu