నాగచైతన్యకు ముగ్గురు హీరోయిన్లా...? అందుకే 'ప్రేమమ్'కు పిచ్చ క్రేజా...? వెంకీ, నాగ్ గెస్ట్ రోల్స్...
నాగ చైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' సినిమా మంగళవారం నాడు సెన్సారైంది. మళయాలంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్'కు రీమేక్ అయిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే అన్ని పోస్ట్ప్రొడక్షన్ పనులు పూర్తికాగా, మంగళవారంతో సెన్సార్ క
నాగ చైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' సినిమా మంగళవారం నాడు సెన్సారైంది. మళయాలంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్'కు రీమేక్ అయిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే అన్ని పోస్ట్ప్రొడక్షన్ పనులు పూర్తికాగా, మంగళవారంతో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. దీంతో సినిమా దసరా రిలీజ్కు పక్కాగా సిద్ధమైపోయింది.
ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. 'కార్తికేయ'తో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. వెంకటేష్, నాగార్జున గెస్ట్ రోల్ చేయడం ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. ఈ సినిమాను వినూత్న పద్ధతిలో ప్రమోట్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.