Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజమౌళి మల్టీస్టారర్‌లో మహేష్ బాబు-జూనియర్ ఎన్టీఆర్!

రాజమౌళి మల్టీస్టారర్‌లో మహేష్ బాబు-జూనియర్ ఎన్టీఆర్!
, సోమవారం, 5 అక్టోబరు 2015 (14:14 IST)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ హవా కొనసాగుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు తర్వాత టాప్ హీరోలు సైతం మల్టీస్టారర్‌లో ఈజీగా నటిస్తున్నారు. తాజాగా బాహుబలి మేకర్ రాజమౌళి మల్టీస్టారర్ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన మహేష్ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌లు నటిస్తున్నట్లు తెలిసింది. రాజమౌళి మాత్రమే ఈ సినిమాకు దర్శకత్వ పగ్గాలు చేపట్టనున్నారు. 
 
బాహుబలి 2కి తర్వాత ''గరుడ'' అనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది రూ.1000కోట్ల సినిమా అని, మహాభారత్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ కూడా ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తారని తెలిసింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌తో తెరకెక్కిన బాహుబలికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి గరుడ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu