రహమాన్, ప్రియా హెండ్రి జంటగా యూస్రి అబ్దుల్ హలీమ్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన మలై చిత్రాన్ని ఫోకస్ ఫిల్మ్స్ బ్యానర్పై గణేష్ నిర్మాతగా తెలుగులో 'మహావంశం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఆదివారం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో విడుదల చేసారు.
ఈ సందర్భంగా.. ఫోకస్ ఫిల్మ్స్ అధినేత గణేష్ మాట్లాడుతూ ''120 ఎ.డిలో అమరావతి నుండి బయలుదేరిన మాడవ వంశానికి చెందినా యువకుడు సౌత్ ఈస్ట్ ఏషియాలోని లంకసుఖ రాజ్యానికి రాజు ఎలా అయ్యాడనేదే ఈ చిత్ర కథాంశం. జూలై 3న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ ''ఇదొక మలేషియన్ చిత్రం. 120 సంవత్సరాల క్రితం జరిగిన మలేషియా చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభుత్వ సహకారంతో గణేష్ గారు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రమిది. ట్రైలర్ చాలా బావుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో జూలై 3న విడుదలవుతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
జవహర్ బాబు మాట్లాడుతూ ''ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అందరినీ అలరించే చిత్రమవుతుంది. ఈ సినిమాతో గణేష్ గారికి మంచి లాభాలు రావాలి'' అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్: అమీర్ హఫీజి, మ్యూజిక్: రెజరామ్, ఫోటోగ్రఫీ: మహమ్మద్ ఖాసిం, ప్రొడ్యూసర్-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: యూస్రి అబ్దుల్ హలీమ్.