Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''24'' కోసం పాట.. ఏఆర్ రెహ్మాన్ సారథ్యంలో నిత్యామీనన్.. కల నెరవేరిందట!

''24'' కోసం పాట.. ఏఆర్ రెహ్మాన్ సారథ్యంలో నిత్యామీనన్.. కల నెరవేరిందట!
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (16:20 IST)
సింగం హీరో సూర్య హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న 24 సినిమాకు ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో నటి నిత్యామీనన్ సింగర్‌గా అవతారం ఎత్తింది. ఇప్పటికే పలు సినిమాల్లో సింగర్‌గా అదరగొట్టిన నిత్యా మీనన్.. 24 కోసం పాటందుకుంది. అదీ ఆస్కార్ అవార్డు గ్రహీత రెహ్మాన్‌ సారథ్యంలో పాట పాడటం ద్వారా తన కల నెరవేరిందని నిత్యామీనన్ ట్విట్టర్లో ఫ్యాన్స్‌తో తన అనుభవాన్ని పంచుకుంది.  
సూర్య, సమంత, నిత్య మీనన్‌ హీరో హీరోయిన్లుగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '24' సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పాపకు జోల పాడే లాలీ జో.. కన్నా జో... అంటూ సాగే పాటను తెలుగులో నిత్యామీనన్ పాడింది. ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో పాట పాడాలనే తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. తల్లీతనయుడి అనుబంధాన్ని ఈ పాట తెలియజేస్తుందని నిత్యమీనన్ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో వివాదానికి దారితీస్తున్న కంగనా - హృతిక్ రోషన్ హాట్ పిక్చర్!