'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'శ్రీమంతుడు'. మహేష్ బాబు ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తాడని దర్శకడు చెప్పాడు. సామాన్యుడి నుంచి శ్రీమంతుడు వరకు అందరికీ కనెక్ట్ అయ్యే కథతో ఈ చిత్రాన్ని రూపొందించానని దర్శకుడు చెప్పారు. జులై 18న ఆడియోను ఆగస్టు 7న సినిమాను విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 27తో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇంకోవైపు ఎన్టిఆర్తో కొరటాల శివ దర్శకత్వం వహించడానికి సిద్ధమాయ్యడు. ఇటీవలే ఆయన్ను కలిసి కథ వినిపించడం, అది నచ్చడం జరిగిందని తెలిసింది. ఈ కథ విన్న తర్వాత సుకుమార్ చిత్రం షూటింగ్ కోసం ఎన్టిఆర్ లండన్ వెళ్ళారు. కాగా ఎన్టిఆర్, కొరటాల కాంబినేషన్లో జనవరిలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది.