Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోలీవుడ్‌లో శింబు రచ్చ... తొందరపడొద్దు ప్లీజ్...: విశాల్ సూచన

కోలీవుడ్‌లో శింబు రచ్చ... తొందరపడొద్దు ప్లీజ్...: విశాల్ సూచన
, శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (16:20 IST)
కోలీవుడ్‌లో యువ హీరో శింబు గొడవ మొదలైంది. మొన్నటికి మొన్న బీప్ సాంగ్‌లో చిక్కుకుని కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి జారుకున్న ఈ కుర్రహీరో.. ఇపుడు మరో వివాదానికి తెరతీశాడు.
 
ఇటీవల చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు నడిగర్ సంఘం తారల క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. దీనికి శింబును ఆహ్వానించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ నడిగర సంఘం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీనిపై సంస్థ ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ స్పందించాడు.
 
బీప్ సాంగ్ వివాదంలో శింబు చిక్కుకున్నప్పుడు అతనితోనూ, అతని తండ్రి టి.రాజేందర్‌తోనూ తాను, నాజర్, కార్తీ చర్చించినట్టు చెప్పారు. ఆ సమయంలో సమస్యను చట్టరీత్యా ఎదుర్కొంటామని రాజేందర్ సూచించడంతో తాము తలదూర్చలేదని విశాల్ వివరణ ఇచ్చారు.
 
అలాగే, ఇప్పటి అంశంలో శింబు ప్రకటనపై ఈ నెల 24వ తేదీన నడిగర సంఘం కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు తొందరపడొద్దని విశాల్ సూచించారు. శింబు ప్రకటన గురించి మీడియా ద్వారానే తమకు తెలిసిందని, దీనిపై చెప్పేందుకు ఏమీ లేదని విశాల్ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu