Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"తలైవి" పాత్రకు రూ.24 కోట్లు?

, ఆదివారం, 24 మార్చి 2019 (15:36 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా "తలైవి" అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో జయలలిత పాత్రను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించనుంది. ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ దర్శకత్వం వహించనున్నారు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇందులో కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. 
 
అయితే, ఈ ప్రాజెక్టులో న‌టించేందుకు కంగ‌నా ర‌నౌత్ 24 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేసింద‌ట‌. కంగ‌నాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు కూడా ఆమెకి అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని టాక్. త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.
 
కాగా, జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మరో రెండు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. వీటిలో ఒకటి 'ది ఐరన్ లేడీ' కాగా, మరొకటి 'పురట్చితలైవి' పేరుతో మరో చిత్రం తెరకెక్కుతోంది. 'ది ఐరన్‌ లేడీ' చిత్రంలో జయలలిత పాత్రలో మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగబాబుకు నా సపోర్టు.. పవన్‌లో ఆ లక్షణాలు ఉన్నాయి : నరేష్