Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగస్టు 15న వరుణ్ తేజ్-క్రిష్‌ల 'కంచె' టీజర్...

ఆగస్టు 15న వరుణ్ తేజ్-క్రిష్‌ల 'కంచె' టీజర్...
, బుధవారం, 12 ఆగస్టు 2015 (18:40 IST)
మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె'. బాలీవుడ్‌లో ఇటివలే గబ్బర్ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.
 
ఈ చిత్రం మొదటి టీజర్‌ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ, ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను హీరో వరుణ్ తేజ్ ఈ రోజు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్, మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి.
 
కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యంలో, 1940లలో సాగే ఒక కథను దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు. 
 
భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్టను పెంచే చిత్రం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

Share this Story:

Follow Webdunia telugu