Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

26/11 ముంబై పేలుళ్ల నేపథ్యంలో ఫాంటమ్‌‌: పాకిస్థాన్‌లో నిషేధం

26/11 ముంబై పేలుళ్ల నేపథ్యంలో ఫాంటమ్‌‌: పాకిస్థాన్‌లో నిషేధం
, శుక్రవారం, 21 ఆగస్టు 2015 (16:52 IST)
ముంబై దాడుల ఘటనకు తానే సూత్రధారినని బాలీవుడ్ సినిమా ఫాంటమ్‌లో చూపారు. ఈ సినిమా రిలీజ్‌కు పాకిస్థాన్‌లో బ్రేక్ పడింది. ఫాంటమ్‌ను పాకిస్థాన్‌లో అడ్డుకోవాలని జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అనంతరం లాహోర్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ షాహిద్ బిలాల్ 'ఫాంటమ్' విడుదలపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇకపోతే కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాకిస్థాన్‌లో ఆగస్టు 28న విడుదల కావాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమాలో తననో ఉగ్రవాదిగా చూపారని, పాకిస్థాన్ పైనా విషం చిమ్మే ప్రయత్నం చేశారని హఫీజ్ సయీద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హుస్సేన్ జైదీ నవల ముంబై అవెంజర్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

Share this Story:

Follow Webdunia telugu