'నమో వెంకటేశాయ' కోసం...
క్షణక్షణంలో.. వెంకటేశ్వరస్వామి బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలో నటించిన అక్కినేని నాగార్జున.. మళ్ళీ ఇన్నాళ్ళకు... స్వామి భక్తుడిగా నటిస్తున్నాడు. 'ఓం నమో వెంకటేశాయ' పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతో
క్షణక్షణంలో.. వెంకటేశ్వరస్వామి బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలో నటించిన అక్కినేని నాగార్జున.. మళ్ళీ ఇన్నాళ్ళకు... స్వామి భక్తుడిగా నటిస్తున్నాడు. 'ఓం నమో వెంకటేశాయ' పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'షిర్డీసాయి' చిత్రాల స్థాయిలో ఉంటుందని.. స్వామి చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి. ప్రముఖుల సూచనల మేరకు చిత్రాన్ని మలుస్తున్నట్లు రాఘవేంద్రరావు ఇటీవలే ఓ సందర్భంలో చెప్పారు.
ఈ చిత్ర కథ గురించి చర్చించినప్పుడు క్షణక్షణం చిత్రాన్ని గుర్తుచేసుకున్నారని తెలిపారు. ఇదిలావుండగా, ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం చిక్మంగుళూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈనెల 20 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. షిరిడిసాయి తీసిన మహేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.