ఎన్టీఆర్ - త్రివిక్రమ్ల సినిమాకి టైమొచ్చింది... 2017లో ముహుర్తం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందాలని ఎంతోకాలంగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీరి ఆకాంక్షలు 2017లో సఫలం కానున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందాలని ఎంతోకాలంగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీరి ఆకాంక్షలు 2017లో సఫలం కానున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ల కాంబినేషన్లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం, నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రకటించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. 2017 సెప్టెంబరులో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ గతంలో "జులాయి", "సన్ ఆఫ్ సత్యమూర్తి", "ఆ..ఆ..." వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.