ఆడియోకు సిద్ధమైన ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'... 12న గ్రాండ్గా రిలీజ్
జూనియర్ ఎన్టిఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం ఆడియోకు సిద్ధమైంది. ఈనెల 12న గ్రాండ్గా హైదబాద్లో విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు వెల్లడించారు.
జూనియర్ ఎన్టిఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం ఆడియోకు సిద్ధమైంది. ఈనెల 12న గ్రాండ్గా హైదబాద్లో విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు వెల్లడించారు. అయితే, ఈ చిత్రం పోస్టర్ను గురువారం నాడు విడుదలచేశారు.
కాగా, ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్ర ఆడియోను గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కాగా, ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మళయాల నటులు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత రికార్డ్లు తిరగరాయటం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.