ఉత్తర అమెరికా తెలుగు సమితి- నాటాకు.. వరుణ్తేజ్ వెళ్ళారు. ఇటీవలే ఆయన కంచె చిత్రానికి అవార్డు రావడంతో అక్కడ మెగాఫాన్స్.. నాటా సభ్యులు ఆయనకు ఆహ్వానం పలికారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే 'నాటా' వారి ఉత్సవాల్లో పాల్గొననున్నాడు. ఉత్సవాలు పూర్తయ్యాక వరుణ్ తేజ్ హైదరాబాద్ రానున్నాడు.
అనంతరం.. శ్రీను వైట్ల, శేఖర్ కమ్ముల తమ సినిమాలకి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి కొంత సమయ పడుతోంది. ఏ సినిమాలో చేయాలన్నది వచ్చాక నిర్ణయిస్తారని తెలిసింది. అయితే.. శేఖర్ చిత్రమే ముందుగా సెట్పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ స్పెయిన్లో జరగనుంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ అక్కడ జరగనుంది.