ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన రాజాసాబ్ సినిమా విడుదల తర్వాత అభిమానులు, ప్రేక్షకులలో మిశ్రమ స్పందన వచ్చింది. అలా రావడానికి కారణం సినిమా ప్రీమియర్లు తెలంగాణాలో పడకపోవడం ఒక భాగమైతే సినిమాలో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందినట్లు దర్శకుడు మారుతీ వివరించారు.
శనివాాారం నాడు మారుతీ విలేకరులతో మాట్లాడుతూ, ప్రసాద్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. చాలా కష్టపడి నిర్మాత వెచ్చించి తీశారు. రూమ్ లో ఫైట్ జరగడం అంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఈరోజుకు ఫీడ్ చేసి కొత్త ప్రభాస్ ను రాజాసాబ్ లో చూపించబోతున్నాం. పండుగకు అన్ని సినిమాలు బాగుండాలని, మాకు వచ్చే ఫీడ్ బ్యాక్ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మా హీరో సినిమా మూడురోజులపాటు నెమ్మదిగా వుంటుందని నాకు మెసేజ్ లు చేశారు.
కలెక్లన్ల పరంగా ఎంత వచ్చాయనేది నాకు తెలీదు. సినిమా మొత్తం ఎంటర్టైన్ మెంట్ చేసింది. నాకు ఫోన్ చేసిన వారంతా అభినందిస్తున్నారు. ప్రభాస్ ను కొత్తగా చూపించారు. యాక్షన్ సినిమాలు తీసే ప్రభాస్ ను ఇలా చూపించడం గొప్ప విషయం అని చెబుతున్నారు అని తెలిపారు.