అక్కినేని ఫ్యామిలీ హీరోలతో తెరకెక్కిన ''మనం'' సినిమా తరహాలోనే చిరంజీవి 150వ సినిమాలోనూ మెగా హీరోలంతా కనిపిస్తారని టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రామ్ చరణ్ నిర్మాతగా అవతారమెత్తే చిరంజీవి 150వ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ఆసక్తికరమైన ఎన్నో అంశాలున్నాయి. ఇందులో ఒకటే.. మెగా హీరోలంతా చిరంజీవి 150వ మూవీలో కనిపించడం.
ఇప్పటికే మెగా సినిమా కోసం వేయి కనులతో ఎదురుచూస్తున్న అభిమానులు.. చిరు సినిమాలో మెగా హీరోలంతా కనిపిసే ఇక పండగే పండగ అంటున్నారు. పవన్ కల్యాణ్తో పాటు అల్లు అర్జున్, సాయి, వరుణ్, సిరీస్లు కూడా ఇందులో నటిస్తారని చెర్రీనే ప్రకటించారు.
మెగాస్టార్ హీరోగా మెగా ఫ్యామిలీ మొత్తం కనిపించే ఈ సినిమాకు తాను నిర్మాణ సారథ్యం వహించడం ఎంతో హ్యాపీగా ఉందని చెర్రీ అన్నాడు. చిరంజీవిగారు కథను ఓకే చేస్తే సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని చెర్రీ అన్నారు.