ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

ఠాగూర్
బుధవారం, 12 నవంబరు 2025 (10:16 IST)
అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సెప్టెంబరు 31వ తేదీన ఆయనను ముంబై మహానగరంలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్చిన విషయంతెల్సిందే. శ్వాసపీల్చడంతో అసౌకర్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ధర్మేంద్రను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సందానీ వెల్లడించారు. కుటుంబ సభ్యుల వినతి మేరకు ధర్మేంద్రకు ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 
 
కాగా, ధర్మేంద్ర మరణించారంటూ మంగళవారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిన విషయం తెల్సిందే. ఈ పుకార్లను ఆయన కుమార్తె ఈషా డియోల్ తీవ్రంగా ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. మా నాన్నగారు క్షేమంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. దయచేసి మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వండి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి ధన్యవాదాలు అని ఇన్‌స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు. అలాగే, ధర్మేంద్ర మృతిపై తప్పుడు ప్రచారం జరగడంతో బాలీవుడ్ దిగ్గజ నటి హేమమాలిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments