‘యే దిల్ హై ముష్కిల్’ - ‘శివాయ్’ చిత్రాలు పాకిస్థాన్లో విడుదల కావడం లేదట!
దర్శకనిర్మాత కరణ్ జొహార్ నిర్మించిన చిత్రం ‘యే దిల్ హై ముష్కిల్’. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్, అనుష్కా శర్మతో పాటు.. పాకిస్థాన్ నటుడు రణ్బీర్ కపూర్ నటించారు. అయితే, ఈ చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంద
దర్శకనిర్మాత కరణ్ జొహార్ నిర్మించిన చిత్రం ‘యే దిల్ హై ముష్కిల్’. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్, అనుష్కా శర్మతో పాటు.. పాకిస్థాన్ నటుడు రణ్బీర్ కపూర్ నటించారు. అయితే, ఈ చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంది. యురీ ఉగ్రదాడిపై ఈ పరిస్థితి ఏర్పడింది.
ఆ తర్వాత కేంద్ర హోంశాఖ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ల వద్దకు ఈ చిత్రం పంచాయతీ వెళ్లింది. అక్కడ సమస్యకు పరిష్కారమైంది. ఫలితంగా భారత్లో ఈచిత్రం విడుదల కానుంది. దీనిపై దర్శనిర్మాతతో పాటు.. నటీనటులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ చిత్రం భారత్లో పాక్ నటుల సినిమాలు విడుదలవుతుండటంపై పాక్ థియేటర్ యాజమాన్యం స్పందిస్తూ, పాకిస్థాన్లో భారత్ సినిమాలపై నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. అయితే అలాంటిదేమీ లేదని పాకిస్థాన్లో ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపాడు.
పాకిస్థాన్లో ఈ సినిమా విడుదల కావడం లేదని తేల్చి చెప్పాడు. ఈ సినిమాతో పాటు అజయ్ దేవ్గణ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘శివాయ్’ కూడా పాక్లో రిలీజ్కు నోచుకోవడం లేదని ఆయన ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫాక్స్స్టార్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తెలియజేసినట్లు ఆయన వెల్లడించాడు.