Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలాం మరణం దేశానికి తీరని లోటు.. బాలీవుడ్ సినీ ప్రముఖుల సంతాపం.. ట్వీట్స్

కలాం మరణం దేశానికి తీరని లోటు.. బాలీవుడ్ సినీ ప్రముఖుల సంతాపం.. ట్వీట్స్
, మంగళవారం, 28 జులై 2015 (12:14 IST)
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల సామాజిక మాధ్యమాల్లో పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తంచేశారు. కలాం ఆకస్మిక మరణం ఎంతో బాధకు గురిచేసిందని, దేశానికి తీరని లోటని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో నమోదు చేశారు. ఎంతో విజ్ఞానం, చిన్న పిల్లల మనస్తత్వం, సాదాసీదాగా, అందరి ప్రేమకు పాత్రులైన దేశ మాజీ రాష్ట్రపతి కన్నమూశారు. ప్రార్థనలు చేయండి అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు.
 
అదే విధంగా బాలీవుడ్ నటీనటులు సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్, మహేష్ భట్, అలియాభట్, కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా, అనుష్కా శర్మ, అనుపమ్ ఖేర్, ప్రియాంక చోప్రా తదితురులు అబ్దుల్ కలాం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu