Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బస్తీ' కుర్రోడికి డేట్‌ ఫిక్సయింది

'బస్తీ' కుర్రోడికి డేట్‌ ఫిక్సయింది
, సోమవారం, 29 జూన్ 2015 (20:39 IST)
బస్తీ కుర్రాడిగా జయసుధ తనయుడు శ్రీయాన్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బస్తీ'. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వాజమన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వాసు మంతెన దర్శకుడిగా పరిచయమవుతూ నిర్మిస్తున్నారు. ప్రగతి చౌరాస్య హీరోయిన్‌గా పరిచయమవుతోంది. దర్శకనిర్మాత వాసు మంతెన మాట్లాడుతూ...''ఒక బస్తీలో రెండు వర్గాల మధ్య జరిగే ఓ గొడవతో నాయకానాయికలు కలుస్తారు. 
 
అలా కలిసినవారు ఒకరినొకరు అర్థం చేసుకుని ఆపై ప్రేమలో పడతారు. ఆ వర్గాలతో వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. వాటిని ఎదుర్కొని వారి ప్రేమను ఎలా సాధించుకున్నారు అనేది కథాంశం. హీరోహీరోయిన్లు బాగా చేశారు. హీరోయిన్‌ వయసు 17 ఏళ్లైనా నటనలో అనుభవం 12 సంవత్సరాలు వుంద''ని తెలియజేశారు.
 
''సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ సన్నివేశాన్ని ఇదివరకు చూసుండరని ఖచ్చితంగా చెప్పగలను. షూటింగ్‌ కేవలం 36 రోజుల్లో పూర్తిచేశాం పాటలతో కలిపి. హీరోహీరోయిన్‌‌తో సహా నాకూ ఇది మొదటి సినిమానే. అయితే ఏదైనా చేసేముందు దాని గురించి పరిశోధించడం నా అలవాటు. అలానే సినిమా చేశాను. ఎక్కడ కొత్తగా అనిపించలేదు. నా బిజినెస్‌ బ్యాక్‌‌గ్రౌండ్‌ ఈ సినిమాకి చాలా సాయపడింది. ఎడిటింగ్‌ కూడా సులువు అవుతుందని రెండు కెమెరాలతో చిత్రీకరణ జరిపాం. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది. కెమెరామెన్‌ గుణశేఖర్‌, ఎడిటర్‌ గౌతంరాజు, జయసుధ ఈ సినిమాకి మంచి సపోర్ట్‌ ఇచ్చారన్నారు''.

Share this Story:

Follow Webdunia telugu