Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలయ్య దంపతుల సమక్షంలో క్రిష్ నిశ్చితార్థం.. హైదరాబాద్ అమ్మాయితో వివాహం!

''గమ్యం'' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆ తర్వాత ''వేదం'', ''కృష్ణం వందే జగద్గురు'', ''కంచె'' వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ పరిశ్రమలో తన

బాలయ్య దంపతుల సమక్షంలో క్రిష్ నిశ్చితార్థం.. హైదరాబాద్ అమ్మాయితో వివాహం!
, శనివారం, 25 జూన్ 2016 (16:32 IST)
''గమ్యం'' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆ తర్వాత ''వేదం'', ''కృష్ణం వందే జగద్గురు'', ''కంచె'' వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా బిజీగా ఉన్నారు. 
 
అయితే, షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకున్న క్రిష్... నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన రమ్యతో ఆయన నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలకృష్ణ దంపతులు హాజరయ్యారు. చాలాకాలం బ్రహ్మచారిగా ఉన్న క్రిష్ తన తల్లి కోరిక మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సో కొద్ది రోజుల్లో క్రిష్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జనతా గ్యారేజ్‌' భారీ బిజినెస్.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్‌గా రూ.18 కోట్లు.. నిజమేనా?