ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన పురస్కారం ఆస్కార్. ఆస్కార్ సెలక్షన్ పానెల్లో మెంబెర్ అయినటువంటి పాపులర్ దర్శకుడు అమోల్ పాలేకర్ ప్రస్తుతం హైదరాబాద్లో 45 సినిమాలను రాబోతున్న అకాడమీ అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి రాజమౌళిక్ భారీ విజయాన్ని అందించిన ‘బాహుబలి’ సినిమా అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనుంది అని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వెల్లడించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్లోని సినిమాలతో బాహుబలి పోటి పడనుంది.
బాలీవుడ్లోని అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రం, అనురాగ్ కశ్యప్ నటించిన ‘అగ్లీ’ , విశాల్ భరద్వాజ్ నటించిన ‘హైదర్’, ప్రియాంక చోప్రా నటించినటువంటి ‘మేరీ కొమ్’టో పాటు తమిళంలో బడ్జెట్ సినిమాలు అయినటువంటి ‘కాకముట్టై’. ఇంకా కొన్ని చిత్రాలు పాల్గొననున్నాయి. ఇక తెలుగులో ఆస్కార్ లిస్టులో చేరినటువంటి చిత్రం కే.విశ్వనాధ్ – కమల్ హాసన్ చిత్రం ‘స్వాతిముత్యం’. ఇక మనం సెప్టెంబర్ 25 వరకు ఫైనల్ సెలక్షన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది.