అలనాటి హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో నటించిన ఈ భామ తాజాగా దృశ్యం హిందీలో పోలీసాఫీసరుగా నటించింది. టాలీవుడ్లో చివరిసారిగా పాండురంగడు సినిమాలో టబు కనిపించింది. బాలకృష్ణ సరసన హాట్ హాట్గా నటించింది. ప్రస్తుతం సీనియర్ భామకు ఓ టాలీవుడ్ ఆఫర్ లభించింది.
అనుష్క ప్రధాన పాత్రలో నటించనున్న భాగమతిలో.. టబుకు ఓ కీలక పాత్ర వచ్చిందట. స్క్రిప్ట్తో పాటు తనది ప్రాధాన్యతతో కూడిన పాత్ర కావడంతో.. ఈ సినిమాలో నటించేందుకు టబు ఓకే చెప్పేసిందని సినీ వర్గాల్లో టాక్. భాగమతిలో టబు రోల్ ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. తాజాగా ఫితూర్ - హైదర్ వంటి సినిమాల్లో టబు తల్లి పాత్రలు చేసింది. ఇదే తరహాలో భాగమతిలో అనుష్కకు అమ్మగా టబు నటించనుందని టాక్ వస్తోంది. కాగా సమ్మర్కు తర్వాత భాగమతి సినిమా సెట్స్పైకి రానుంది.