Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎఫైర్‌లో నటించి తప్పు చేశాను: బాధపడుతున్న యాంకర్ ప్రశాంతి

ఎఫైర్‌లో నటించి తప్పు చేశాను: బాధపడుతున్న యాంకర్ ప్రశాంతి
, శనివారం, 3 అక్టోబరు 2015 (13:55 IST)
యాంకర్లు సినీ హీరోయిన్లుగా మారే ప్రస్తుత ట్రెండ్‌లో.. యాంకర్ ప్రశాంతి మాత్రం కష్టాల్లో కూరుకుపోయింది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అనసూయ, రష్మీలు హీరోయిన్స్ స్థాయికి ఎదిగిపోతే.. యాంకర్ ప్రశాంతికి మాత్రం చుక్కెదురైంది. ఎఫైర్ వంటి సినిమాల్లో నటించాక మంచి సినిమాల్లో ఆఫర్లు రావని ఆమె బాధపడుతోంది. 
 
బుల్లి తెరపై యాంకరింగ్ చేస్తూ జాలీగా మాట్లాడే ఈ అమ్మడు చాలా హోమ్లీగా ఉండేది. లాంగా వోణి వేసుకొని యాంకరింగ్ చేస్తూ ఈ అమ్మడిని చూస్తే అచ్చు పదహారణాల తెలుగుమ్మాయిని చూసినట్లు అనిపించేది. సినిమాలో ఛాన్స్ వస్తే ఎంత గ్లామర్ పాత్రలైనా వల్గర్ పాత్రలైనా సిద్ధమనే ఈ కాలంలో తనూ అదే బాట పట్టింది. తద్వారా ప్రశాంతి  'ఎఫైర్ ' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 
 
ఇద్దరు అమ్మాయిల మద్య జరిగే ఇల్లీగల్ 'ఎఫైర్ ' గురించి సినిమాలో ఉంటుందట సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రశాంతి ఓవరాక్షన్ చేసినట్లు కనిపిస్తుంది. తెలుగులో ఇప్పటిదాకా రానటువంటి లెస్బియన్ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రశాంతి, గీతాంజలి లీడ్ రోల్స్‌లో నటించి ఇద్దరికీ ఇద్దరే అనే రీతిలో రెచ్చిపోయే వారి అందచందాలను వెండితెరపై చూపించారని టాక్.

దీంతో నిర్మాతల నుంచి కొన్ని సందర్భాల్లో ఏ సినిమాల ఒత్తిడి పెరిగిపోతోందని సన్నిహితులతో ప్రశాంతి వాపోయిందట. అంతేగాకుండా ఈ సినిమాతో తనకొచ్చిన బోల్డ్ స్టార్ డమ్ నుంచి బయటపడాలని ప్రశాంతి డిసైడైపోయింది. మరి ప్రశాంతికి ఎలాంటి ఆఫర్లు వస్తాయో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu