టాలీవుడ్ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్లైన్ వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, పరువు నష్టం మార్ఫింగ్ చేసిన, ఏఐ సృష్టించిన లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్ను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టెలివిజన్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సహా 42 మందిపై ఫిర్యాదు చేశారు. మంగళవారం నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ తన అభిప్రాయాలను వెల్లడించారు.
దీంతో తనపై ఆన్లైన్ దాడి జరిగిందని అనసూయ పేర్కొన్నారు. తన రాబోయే చిత్రం దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, శివాజీ నటీమణులను చీరలు, సాంప్రదాయ దుస్తులు ధరించమని కోరాడు. దుస్తులపై చేసిన శివాజీ వ్యాఖ్యలను అనసూయ ఖండించారు.
దీంతో తనపై ఆన్లైన్లో బెదిరింపులు, వేధింపులు మొదలైనట్లు అనసూయ తెలిపారు. ఈ వేధింపులు తన భద్రతా భావాన్ని, జీవనోపాధిని, ప్రజా జీవితంలో పాల్గొనే అవకాశాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 75, 79, 336(4), 351, 356, ఐటీ చట్టంలోని 66-E, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.