అమలాపాల్తో ఆటాడుకుంటున్న కబాలి: ధనుష్-రంజిత్ సినిమాలో రజనీకి జోడీగా..?
ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలా పాల్ ధనుష్ సినిమాలో ఛాన్స్ రాగానే అప్పట్లో పెళ్ళైనా కూడా ఓకే చెప్పింది. భర్త విజయ్ వద్దన్నా వినలేదు. చివరికి అమలాపాల్ తన మాట వినలేదని ఆమె భర్త వదిలేశాడు. ఇక సినిమాలతో కాల
ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలా పాల్ ధనుష్ సినిమాలో ఛాన్స్ రాగానే అప్పట్లో పెళ్ళైనా కూడా ఓకే చెప్పింది. భర్త విజయ్ వద్దన్నా వినలేదు. చివరికి అమలాపాల్ తన మాట వినలేదని ఆమె భర్త వదిలేశాడు. ఇక సినిమాలతో కాలం గడిపేద్దామనుకుంటే.. ధనుష్ సినిమాలో ఛాన్స్ పోయిందని వార్తలొచ్చాయి. ఇందుకు ధనుష్ భార్య ఐశ్వర్య రెడ్ సిగ్నల్ ఇవ్వడమేనని కోలీవుడ్లో టాక్ వచ్చింది. కానీ ధనుష్ అమలా పాల్ను తన సినిమాలో నటింపజేయాలని డిసైడైపోయాడు.
అయితే ఐశ్వర్య మాత్రం అమలా పాల్ వ్యవహారాన్ని తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్ దృష్టికి తీసుకెళ్లింది. ధనుష్- అమలాపాల్ మధ్య అఫైర్ కొనసాగుతోందని.. దాంతో తన వివాహ జీవితానికి ఇబ్బందులు తప్పవంటూ తండ్రి వద్ద ఐష్ కన్నీళ్లు పెట్టుకుందట. దీంతో అమలాపాల్ ఇష్యూను రజనీకాంత్ డీల్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకే అమలాపాల్ను ధనుష్, రంజిత్ సినిమాలో తనకు జోడీగా నటింపజేయాలనుకున్నారట. దీంతో 8 నెలల పాటు అమలా పాల్ రజనీకాంత్తో కలిసి షూటింగ్లో పాల్గొనాల్సి వస్తుంది. తద్వారా ధనుష్-అమలాపాల్లపై కన్నేసి ఉంచవచ్చునని రజనీకాంత్ నిర్ణయించారట.
ఫలితంగా రజనీ సరసన అమలాపాల్ నటింపజేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అమలాపాల్ పరిస్థితి కూడా దారుణంగా ఉండటంతో తనను పెట్టి గేమ్ ఆడుతున్నారనే విషయం తెలుసుకున్నా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కామ్గా వెళ్ళిపోవాలనుకుంటోంది. ఇక రజనీతో అమలాపాల్ నటిస్తే.. ధనుష్తో ఆమెకు గల స్నేహం కూడా బాగా తగ్గిపోతుందని ఐష్ భావిస్తోంది. మరి అమలాపాల్ ఇష్యూలో మామగారు ఎంట్రీ కావడంతో బక్క హీరో ధనుష్ ఎలా వ్యవహరిస్తాడో వేచి చూడాలి. ఆ విధంగా రజనీ సరసన నటించేందుకు అమలాపాల్కు ఛాన్సొచ్చింది..!