ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన వారసురాలిని ప్రకటించారు. తన ఆస్తికి అలియాభటే వారసురాలని ప్రకటించారు. దీంతో మీడియాతో పాటు అందరూ షాక్ అయ్యారు. మొదటి నుంచి తనకు అలియా అంటే చాలా ఇష్టమని, ఏదో ఒక రోజు తన వద్ద ఉన్న ఆస్తి మొత్తానికి ఆమె వారసురాలవుతుందని కరణ్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న 'కపూర్ అండ్ సన్స్'లో అలియా నటిస్తోంది.
ఈ చిత్రం ట్రైలర్ను ముంబయిలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగానే కరణ్ జోహార్ మాట్లాడుతూ.. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కరణ్ జోహార్ సరదా కోసం అలా మాట్లాడారా? లేకుంటే కరణ్ జోహార్ అన్నది నిజమేనా అనేది తేల్చుకోలేకపోయారు. కాగా, కరణ్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో అలియా బాలీవుడ్కు పరిచయమైన సంగతి తెలిసిందే.
ఇకపోతే.. కపూర్ అండ్ సన్స్ చిత్రంలో కరణ్ జోహార్ తల్లి హిరూ జోహార్ నటించారని, అలాగే రిషీ కపూర్ అలియా భట్కు తాతయ్య రోల్లో కనిపిస్తారని కరణ్ జోహార్ వెల్లడించారు. రిషి కపూర్ షూటింగ్ కోసం చాలా కష్టపడ్డారని.. గంటల పాటు మేకప్తో అలానే కూర్చుని.. షూటింగ్ త్వరతిగతిన పూర్తి చేసేందుకు ఎంతగానో సహకరించారని చెప్పుకొచ్చారు.