Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కథలువింటున్న అతిలోక సుందరి... త్వరలో కుమార్తెలు తెరంగేట్రం...

కథలువింటున్న అతిలోక సుందరి... త్వరలో కుమార్తెలు తెరంగేట్రం...
, శుక్రవారం, 3 జులై 2015 (11:49 IST)
అలనాటి అందాల తార శ్రీదేవి పెళ్లి, పిల్లలు అంటూ కొంత గ్యాప్ ఇచ్చి, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ అయిన తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈమె ఇటీవల కొత్త కథలు వింటోందట. అయితే ఆమె కథలు వినేది తన కోసం కాదట, తన ముద్దుల కుమార్తెలు జాహ్నవి, ఖుషీ కపూర్‌ల కోసమట. 
 
శ్రీదేవి తన కుమార్తెలను వెండితెరకు పరిచయం చేయాలని అనుకుంటుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే వున్నాయి. అయితే ఆ విషయం గురించి అడిగినప్పుడంతా సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ వచ్చింది. ఈ స్థితిలో ఇటీవల శ్రీదేవి పలువురి వద్ద నుంచి కథలు వింటుందట. శ్రీదేవికి కథ నచ్చడమే తరువాయి .. ముందుగా వెండితెరపైకి పెద్ద కూతురు జాహ్నవిని పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా శ్రీదేవి ఒక వైపున నటిగా తాను తిరిగి బిజీ అవుతూనే.. మరోవైపు తన కుమార్తెలను కూడా వెండితెరకు పరిచయం చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోందని సమాచారం. ఆమె ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం.

Share this Story:

Follow Webdunia telugu