నేను బట్టలిప్పడం వలనే ఇలా జరిగింది. ఆయన రియల్ హీరో..

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:00 IST)
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నివారించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్యానెల్ (క్యాష్-కమిటీ ఎగైనిస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) ఏర్పాటు చేయనున్నట్లు జీవో జారీ చేయడంతో శ్రీరెడ్డి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గతేడాది సినీరంగంలో మహిళలపై జరుగుతున్న సెక్సువల్ హరాస్మెంట్, కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేసిన ఆందోళన సంచలనం అయింది. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చేసిన అర్థ నగ్న నిరసన జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశం అయింది.
 
తాజాగా తెలంగాణ ప్రభుత్వం 25 మంది సభ్యులతో క్యాష్ కమిటీ ఏర్పాటు చేయనుంది. టాలీవుడ్‌కు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులను ఈ కమిటీ డీల్ చేయబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నేతృత్వంలో కొనసాగే ఈ కమిటీలో స్టేట్ ఉమెన్ డెవల్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమీషనర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్‌లు, లేబర్ డిపార్ట్‌మెంట్ కమీషనర్, షి టీమ్స్ ప్రతినిధులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్‌లను సభ్యులుగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఎమోషనల్ పోస్ట్‌తో సీఎం కేసీఆర్‌కు, తనకు మద్దతుగా నిలిచిన కొందరు మహిళా సంఘాల ప్రతినిధులకు ఫేస్‌బుక్ వేదికగా థాంక్స్ చెప్పారు. హైదరాబాద్ వ్యక్తిగా నేను గర్వపడే సమయం ఇది. రియల్ హీరో కేసీఆర్ గారికి ధన్యవాదాలు. నా కల ఈ రోజు నెరవేరుతోంది. బి** అనే కళంకంతో ఉన్న నన్ను ఈ ప్రపంచానికి హీరోయిన్‌ అయ్యేలా చేశారు. నేను బట్టలు విప్పి చేసిన నిరసనకు ఫలితంగా నేడు తెలుగు సినిమా పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ సమస్యలను పరిష్కరించే క్యాష్ కమిటీ ఏర్పడిందంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

New Political Party: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. కొత్త పార్టీ పెట్టేదెవరంటే?

కన్నకూతురినే కిడ్నాప్ చేసారు.. కళ్లలో కారం కొట్టి ఎత్తుకెళ్లారు..

పెళ్లై 3 నెలలే, శోభనం రోజున తుస్‌మన్న భర్త: భార్య రూ. 2 కోట్లు డిమాండ్

Pawan Kalyan: ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన.. చర్చలకు సిద్ధమని పవన్ ప్రకటన

విజయవాడ భవానీపురంలో మహిళ పీక కోసిన వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం