నయనతారతో నాకో సమస్య ఉంది... అదేంటో బయటకు చెప్పలేను : త్రిష
త్రిష, నయనతారలు ఒకపుడు అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఇపుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ.. వీరిద్దరి మధ్య ఎలాంటి సఖ్యత లేదు. వాస్తవానికి వీరిద్దరు బద్ద శత్రు
త్రిష, నయనతారలు ఒకపుడు అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఇపుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ.. వీరిద్దరి మధ్య ఎలాంటి సఖ్యత లేదు. వాస్తవానికి వీరిద్దరు బద్ద శత్రువులుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆప్త మిత్రులైపోయారు. కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు హాజరయ్యేవారు. అంతా సఖ్యతగానే ఉందనుకుంటున్న సమయంలో నయనతారతో నాకో సమస్య ఉందని బాంబు పేల్చింది
త్రిష. హీరో శింబు తనకు స్నేహితుడని, తన వెన్నంటి ఉండేది శింబునేనని చెబుతూ నయనతార గురించి ప్రస్తావించింది త్రిష. ‘నయనతారకు, నాకు మధ్య బోలెడు సమస్యలు ఉన్నాయన్నది మీడియా సృష్టే. అయితే మా మధ్య సమస్యలేమీ లేవని చెప్పలేను. నయనతారతో నాకో సమస్య ఉంది. అదేంటో బయటకు చెప్పలేను. మా మధ్య ఉన్న భేదాభిప్రాయాలను స్నేహితుల ద్వారా తెలుసుకుని అర్థం చేసుకున్నాం. కొన్ని రోజులు మేం అస్సలు మాట్లాడుకోలేదు. అయితే ఇప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే పలకరించుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం. అయితే వృత్తిపరంగా నయన్ ఎప్పుడూ నాకు ప్రత్యర్థేన’ని ఈ చెన్నై చిన్నది చెప్పుకొచ్చింది.