Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జై లవ కుశ పాట కోసం 42 డ్రెస్సులు మార్చిన యంగ్ టైగర్.. పాట అదిరిపోతుందట..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నిర్మాణంలో 'జై లవకుశ' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్త

జై లవ కుశ పాట కోసం 42 డ్రెస్సులు మార్చిన యంగ్ టైగర్.. పాట అదిరిపోతుందట..
, గురువారం, 27 జులై 2017 (17:12 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నిర్మాణంలో 'జై లవకుశ' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. పూణేలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో కీలకమైన పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ పాటలో మూడు పాత్రల కోసం మాటిమాటికి ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్‌తో రెడీ కావలసివచ్చింది. అలాగే మూడు పాత్రలకు కలుపుకుని ఈ ఒక్క పాటలోనే 42 రకాల జతల డ్రెస్‌లను వాడినట్టు చెప్తున్నారు. డ్రెస్‌లతో పాటు ఎప్పటికప్పుడు బాడీ లాంగ్వేజ్‌ను, లుక్‌ను మారుస్తూ ఎన్టీఆర్ ఈ పాట షూటింగ్‌లో పాల్గొన్నాడని.. ఈ పాట ద్వారా నందమూరి ఫ్యాన్స్‌కు యంగ్ టైగర్ మంచి ట్రీట్ ఇస్తారని సినీ యూనిట్ చెప్తోంది. 
 
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన జై లవ కుశ పాటలు ఆగస్టులో విడుదల కానున్నాయి. రెండో టీజర్ ఆగస్టు 1వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 21వ తేదీన రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురు పిల్లలతో బల్గేరియాలో స్టార్ హీరో జాలీ ట్రిప్‌...