స్టార్ సెలెబ్రిటీస్ సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు వివాహం జరిగినప్పటి నుండి, ఫోటోలు వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త ఫోటో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూనే వుంది. ఇప్పుడు రాజ్ సోదరి, శీతల్, మరో కుటుంబ ఫోటోను పంచుకున్నారు. అది కూడా ఆన్లైన్లో బాగా వైరల్ అయింది.
ఇది పూర్తి గ్రూప్ ఫోటో, ఇందులో సమంత, రాజ్, అతని తల్లిదండ్రులు, శీతల్, పిల్లలు, మొత్తం బృందం అంతా ఒకే ఫ్రేమ్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే, ది ఫ్యామిలీ మ్యాన్ సక్సెస్ ఈవెంట్లో వారిని అందరినీ కలిపి చూసిన తర్వాత, ఈ కొత్త ఫోటో ఎవరినీ ఆశ్చర్యపరచలేదు, కానీ అభిమానులు మాత్రం దీనికి పిచ్చెక్కిపోయారు.
ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్లో పాల్గొంటూ సెట్కు తిరిగి వచ్చేసింది. సమంత పెళ్లి తర్వాత మొదటిసారిగా బయటకు వచ్చింది. గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్లో.. ఎవరో ఆమెను గుర్తించారు. కొన్ని నిమిషాల్లోనే ఆ వీడియో అంతటా వైరల్ అయింది.
అభిమానులు ఆమె పెళ్లి తర్వాత లుక్ను చూడటానికి ఎదురుచూస్తున్నారు. కాబట్టి సహజంగానే ఆ క్లిప్ విపరీతంగా వైరల్ అయింది. ఆమె బాలీవుడ్ చిత్రం ధురందర్ చూడటానికి అక్కడికి వెళ్లినట్లు తెలిసింది.