నా అభిమాన దర్శకుడితో సినిమా చేస్తున్నా.. చాలా సంతోషంగా ఉంది : సాయి ధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం తిక్క. ఈ హీరో వరుస సినిమాల హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు. ఇదిలావుంటే దర్శకుడు కృష్ణవంశీ ''గోవిందుడు అందరివాడేలే'' చిత్రం తర్వాత సందీప్ కిషన్ హీర
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం తిక్క. ఈ హీరో వరుస సినిమాల హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు. ఇదిలావుంటే దర్శకుడు కృష్ణవంశీ ''గోవిందుడు అందరివాడేలే'' చిత్రం తర్వాత సందీప్ కిషన్ హీరోగా ''నక్షత్రం'' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సందీప్కిషన్కి జంటగా రెజీనా నటిస్తోంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నాడు.
రియల్ లైఫ్లో సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ మంచి మిత్రులు. అందుకే స్నేహితుల రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు దర్శకుడు కృష్ణవంశీ ప్రకటించారు. ''ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నా యంగ్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ మా చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు" అని కృష్ణవంశీ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కి ''నా అభిమాన దర్శకుల్లో ఒకరైన కృష్ణవంశీతో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది'' అని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు. త్వరలో సాయిధరమ్తేజ్ షూటింగ్లో పాల్గొంటాడని కృష్ణవంశీ పేర్కొన్నారు.