Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రావు రమేష్ పారితోషికం కోటి రూపాయలా...?!

రావు రమేష్ పారితోషికం కోటి రూపాయలా...?!
, శనివారం, 26 సెప్టెంబరు 2015 (18:21 IST)
క్యారెక్టర్‌ ఆర్టిస్టు రావు రమేష్‌ కోటి రూపాయల దాకా చేరినట్లు తాజా సమాచారం. రావు గోపాలరావు కుమారుడైన రావు రమేష్ మద్రాసులో సీరియల్స్‌ చేస్తూ... ఎలాగైనా సినిమాల్లోకి రావాలని తెలిసివారిని అందరినీ అడిగి.. చిన్నచిన్న వేషాలు వేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన నాన్నలాగా స్లో నెరేషన్‌ డైలాగ్‌లు చెప్పడంతో ఆయన కెరీర్‌ మారిపోయింది. 
 
సీతమ్మ వాకిట్లో... చిత్రం తర్వాత ఓ మోస్తరు పేరు వచ్చింది. ఇక ఇటీవలే విడుదలైన సినిమా చూపిస్త మావతో మరింతగా పెరిగింది. ఇప్పటివరకు రోజుకు 4 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. రోజులు ఎక్కువైతే కొంత తగ్గింపు వుంటుంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్సూత్సవం చిత్రం విషయంలో 36 రోజులకుగాను కోటి రూపాయలు ఇచ్చేందుకు నిర్మాత పివీపీ ప్రసాద్‌ సిద్ధమయ్యారట. దీంతో ఆయన రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయినట్లయింది. కేవలం క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, విలన్‌గా చేస్తున్న ఆయనకు ఈ రేంజ్‌లో పెరగడం గొప్ప విషయంగా చెబుతున్నారు. మొత్తానికి తండ్రికి తగ్గ కుమారుడనిపించుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu