అనుష్క హీరోయిన్గా రూ.25 కోట్ల బడ్జెట్తో భాగమతి.. హీరో ప్రభాస్ నిర్మాతగా...
బొద్దుగుమ్మ అనుష్క కొత్త సినిమా ''భాగమతి''కి సంబంధించిన వార్తలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు అనుష్క. గతంలో విడుదలైన ''అరుంధతి'', ''రుద్రమదే
బొద్దుగుమ్మ అనుష్క కొత్త సినిమా ''భాగమతి''కి సంబంధించిన వార్తలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు అనుష్క. గతంలో విడుదలైన ''అరుంధతి'', ''రుద్రమదేవి'', చిత్రాలలో తనదైనశైలిలో నటించి మంచి పేరుని సంపాదించుకుంది. ప్రస్తుతం టెక్నో థ్రిల్లర్గా రూపొందుతున్న ''భాగమతి'' సినిమా బడ్జెట్ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.
ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా.. ఏకంగా రూ.25 కోట్లు. గతంలో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడ నిర్మాతలు వెనుకాడుతారు. అయితే ''అరుంధతి'' విజయం తర్వాత అనుష్క హవా పెరిగి పోవడంతో ఆమెను నమ్ముకుని భారీ సినిమాలు తీయడానికి నిర్మాతలు ఏమాత్రం వెనుకాడడం లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్గా రాబోయే ''భాగమతి'' సినిమాకి నిర్మాతలు భారీ రేంజ్లో ఖర్చు పెడుతున్నారని ఫిలిం వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు ఈ సినిమా కోసం భారీ మహల్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ సెట్ కోసమే నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారని సినీ నిపుణులు అంటున్నారు.. హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతున్న ఈ సినిమాకి ''పిల్ల జమీందారు'' ఫేమ్ అశోక్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలనాటి అందాల నటి టాబు, యంగ్ హీరో ఆది పినిశెట్టి, మళయాళ సంచలనం ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ ప్రమోద్ "యూవీ క్రియేషన్స్'' బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక అతిథి పాత్ర చేయబోతున్నాడు అన్న వార్తలు ఈ సినిమా క్రేజ్ను మరింత పెంచేస్తోంది.