Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తని ఒరువన్ రీమేక్: చెర్రీ విలన్‌ అరవింద్ సామికి తండ్రిగా పోసాని.. కామెడీ పండిస్తాడట!

తని ఒరువన్ రీమేక్: చెర్రీ విలన్‌ అరవింద్ సామికి తండ్రిగా పోసాని.. కామెడీ పండిస్తాడట!
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (11:24 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అల్లు అర‌వింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ తండ్రి పాత్ర‌ను పోసాని కృష్ణ‌ముర‌ళి పోషిస్తున్నారు. ఏ పాత్రనైనా సరే తనదైన శైలితో, కామెడీ పంచ్‌లతో అందరిని మెప్పించే ప్రముఖ క్యారెక్టర్ నటుడు పోసాని కృష్ణమురళి. పోసాని చేస్తున్న కేరక్టర్స్ జనాలకు చాలా సంవత్సరాలు గుర్తుండిపోయేవిగా ఉంటున్నాయి. అంతటి ఇంపార్టెంట్ రోల్స్‌కి.. తన స్టైల్‌తో ప్రాణం పోస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించేస్తున్నాడు పోసాని. 
 
తని ఒరువన్‌ని తెలుగు రీమేక్‌ని త్వరలో స్టార్ట్ చేయనున్నాడు చెర్రీ. ఈ సినిమా షూటింగ్‌ను ఈనెల 21 నుంచి ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విలన్ అరవింద్ స్వామికి తండ్రి పాత్రను తమిళంలో తంబి రామయ్య పోషించారు. ఈ పాత్రకు పోసానే న్యాయంచేయగలరని చరణ్-సూరి ఫిక్స్ అయ్యారు. పోసాని కూడా అరవింద్ స్వామికి తండ్రిగా నటించడానికి అంగీకరించాడు. తమిళంలో తంబి రామయ్య చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాత్రను చేసేందుకు పోసాని కృష్ణమురళి కరెక్ట్ ఆప్షన్ అంటున్నారు. పోసాని కెరీర్‌లో చిరకాలం గుర్తుండిపోయే మరో పాత్రగా రక్షక్ ఉంటుందన్న మాట. 

Share this Story:

Follow Webdunia telugu