అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' స్పెయిన్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారాన్ని బట్టి ఈ చిత్ర ఆడియోను మార్చి 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారనీ, ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అటెండ్ అవుతారని అనుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత నటిస్తోంది.
ఇంకా ఆదాశర్మ, నిత్యామీనన్ నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా గతంలో బన్ని-త్రివిక్రమ్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే నిర్మాత కాంబినేషన్లో వీరు ముగ్గురి కలయికలో వస్తున్న సినిమా కావడంతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఆడియోతో పాటు సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి.